ఇలాంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించవచ్చా…. పూజిస్తే ఏం జరుగుతుంది?

సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం మన పూజ గదిలో ఎన్నో రకాల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉంటాము అయితే విగ్రహాలు వివిధ రకాల లోహాలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ఎంతో మంచిది కాగా మరికొన్ని విగ్రహాలను పూజించకూడదని చెబుతుంటారు. మరి ఎలాంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించవచ్చు. వాటిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…

సాధారణంగా బంగారం, వెండి , ఇతడితో తయారు చేసిన విగ్రహాలను పూజ గదిలో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలాంటి విగ్రహాలను పూజించటం వల్ల ఆ పూజ ఫలితం లభిస్తుంది.ఏ ఇంట్లో అయితే ఇలాంటి విగ్రహాలను పెట్టి పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారిపై సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు కనుక దేవుళ్ళ చిత్రపటాలను పెట్టుకుని కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా వెండి ఇత్తడితో బంగారు తో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ఎంతో మంచిది.

ఇక ఇనుము, అల్యూమినియం, ఉక్కు వంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు. వీటిని దేవుడి గదిలో ఉంచి పూజించటం అశుభ సంకేతం. అటువంటి విగ్రహాలను పూజించడం వల్ల ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
అంతే ఇంట్లో విగ్రహాన్ని ఉంచి పూజించడానికి విగ్రహానికి ఉపయోగించే లోహం మాత్రమే కాదు ఎత్తు కూడా ముఖ్యం. దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉంచి పూజించాలి అనుకునేవారు కేవలం మన బోటలివేలు పొడవు ఉండే విగ్రహాలను మాత్రమే పూజించాలి. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పూజించకూడదు.