తిరుమలలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ

తిరుమల శ్రీవారిని మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ దర్శించుకున్నారు. కేటీఆర్ సతీమణి శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మంత్రి కొడుకు హిమన్షును స్వామివారి పట్టువస్ర్తాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో కేటిఆర్ రాలేదు.