వివాహిత కాలి మెట్టెలు ధరించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక ఆడపిల్లకు పెళ్లి అయిన తర్వాత తన వ్యవహార శైలి పూర్తిగా మారిపోతుంది.పెళ్లయిన అమ్మాయి మెడలో నల్లపూసలు కాలికి మెట్టెలు చేతులకి మట్టి గాజులు నుదుటిన సింధూరం తప్పనిసరిగా ఉండాలని చెబుతుంటారు.ఇలా నిండు ముత్తైదువుల పెళ్లైన మహిళ కనిపించడం వల్ల తన మాంగల్యం పది కాలాలపాటు మంచిగా ఉంటుందని భావిస్తుంటారు.ఇక పెళ్లి జరిగిన స్త్రీ తప్పనిసరిగా కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం కూడా ఆనవాయితీ.అయితే ఈ మెట్టెలు ధరించే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు.

వివాహిత పెళ్లి తర్వాత కాలికి మెట్టెలు ధరిస్తుంది అయితే ఈ మెట్టెలు ధరించే తప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి.వివాహిత పెళ్లి తర్వాత ధరించే మెట్టెలు చంద్రుని సూచిస్తాయి కనుక ఎప్పుడూ కూడా కాలికి రెండవ వేలిలో మెట్టెలు ధరించాలి. అయితే ఈ మెట్టెలు పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు.అలాగే వాటిని తీసి పక్కన పెట్టి పని మీద బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే పెడుతుంటారు కొందరు ఇలా అసలు పెట్టకూడదు.

ఇక పెళ్లయిన వారు వెండి మెట్టలను మాత్రమే కాలికి ధరించాలి.చాలామంది ధనవంతులు బంగారు మెట్టలను ధరిస్తారు ఇలా బంగారు మెట్టెలు కాలికి ధరించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. బంగారులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు అలాంటి లక్ష్మీదేవిని కాలు మెట్టెలుగా ధరించి తొక్కడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది కనుక ఎప్పుడు కూడా బంగారు మెట్టెలను పెట్టకూడదు కేవలం వెండి మెట్టలను మాత్రమే పెట్టాలి.ఇలా మెట్టెలు ధరించే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయకూడదు.