సిరిసంపదలతో తూలుతూగాలంటే పూజ గదిలో ఈ వస్తువులు తప్పనిసరి!

Mandir-for-home-Your-guide-to-set-up-a-pooja-room

సాధారణంగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. ఇలా కష్టపడి పని చేయటమే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లోనే పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం. అందువల్ల పూజ గదిలో పూజకి అవసరమైన కొన్ని రకాల వస్తువులు తప్పనిసరిగా ఉంచాలి. మీ ఇంట్లో సిరిసంపదలు లోటు లేకుండా ఉండాలంటే పూజ గదిలో ఏ ఏ వస్తువులను ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన ఇంట్లో సిరిసంపదలు ఉండాలంటే పూజ చేసే సమయంలో పూజ గదిలో తప్పనిసరిగా ఇంట్లో గంట ఉండడం ఎంతో మంచిది.ఇక దేవుడి పూజ చేసిన అనంతరం తప్పనిసరిగా స్వామి వారికి హారతులు ఇస్తాం అందుకే స్వామివారికి హారతి ఇవ్వడానికి కర్పూరం కూడా ఎంతో ముఖ్యమైనది కనుక పూజ గదిలో కర్పూరం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక పూజ అంటే తప్పనిసరిగా పూజకు పుష్పాలు ఉండాలి ఇలా దేవుడి గదిలో పూజ చేసే సమయంలో పుష్పాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి.

పూజ సమయంలో స్వామికి ఫలం అందించడం కూడా ఎంతో ముఖ్యం మనసు ఫలాలు అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించకుండా దేవుడికి అర్పించడం అని అర్థం. హృదయమనే కొబ్బరికాయని కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల కోరికలు అనే పీచు నుండి కొబ్బరికాయను వేరుచేసి తీయనైన కొబ్బరిని దేవుడికి సమర్పించాలి. అంటే మనలో ఉన్న కోరికలను వదిలేసి మన హృదయాన్ని భగవంతుడిపై లీనం చేయడం. ఇలా పూజ చేసే సమయంలో ఈ వస్తువులు తప్పనిసరి.