టీఆర్ఎస్ పార్టీలో మరో తీవ్ర విషాదం.. మరో కీలక నేత మృతి !

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఏడాది అంతగా కలిసి రావడం లేదు. ఇప్పటికే పార్టీ ఎంతోమంది కీలక నేతలని కోల్పోయింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కి చెందిన మరో కీలక నేత కన్నుమూశారు.

నర్సంపేట జిల్లా అధ్యక్షుడు నాయని నర్సయ్య గుండెపోటు తో బుధవారం మృతి చెందారు. నాయని నర్సయ్యకు గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

అయితే, ఆస్పత్రికి తీసుకుని వచ్చేసరికి ఆయన చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. నర్సయ్య మృతికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నర్సయ్య పోరాటాన్ని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఈ ఏడాది లోనే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి లాంటి కీలక నేతలు కన్నుమూశారు. నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత రోజే మరో నేత నాయని నర్సయ్య కూడా మృతి చెందారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌ లోని కొత్తపేట లో ఉన్న నోముల నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. పార్టీ నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ నోముల కుటుంబానికి భరోసా ఇచ్చారు.