కాంగ్రెస్ లో రవళి రెడ్డికి మరో కీలక పోస్టు

వరంగల్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవళి కూచన. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొద్దిరోజుల్లో ఆమెకు పిసిసి అధికార ప్రతినిథి పదవి దక్కింది. 

తాజాగా ప్రచార కమిటీ సభ్యురాలిగా రవళికి స్థానం కల్పించారు. ఈ మేరకు 17 మంది ప్రచార కమిటీ లో చోటు కల్పించారు. ఈ 17 మంది కొత్త సభ్యులతో కూడిన జాబితాను ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. 

ఈ కమిటీలో ఎరావత్రి అనీల్, రవళి రెడ్డి, కృష్ణ కుమార్ గౌడ్, వరంగల్ రవి, తోటకూర రవిశంకర్, వర్రి ప్రకాష్ లలిత్, వసుంధర శ్రీనివాస్, రాజవర్దన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి వెంకటేష్, బండారు శ్రీకాంత్, మోత్కురి ధర్మారావు, ఎండి హనీఫ్ ఖాన్, బి హెచ్ రబ్బానీ, మొక్కా శేఖర్ గౌడ్, వీరేశం ప్రేమ్ కుమార్, రాపర్తి శరత్ కుమార్ లు ఉన్నారు. 

మధు యాష్కీ గౌడ్

టి పిసిసి ప్రచార కమిటీకి విజయశాంతి స్టార్ క్యాంపెయినర్

కమిటీ కన్వీనర్ గా మధు యాష్కీ గౌడ్

మరో కన్వీనర్ డికె అరుణ ఇప్పటికే నియమితులైన విషయం తెలిసిందే. 

టిఆర్ఎస్ నుంచి వచ్చిన వసుంధర కు పోస్టు

టిఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి ఉన్న వసుంధర శ్రీనివాస్ ఇటీవల కాలంలో టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు ఈ కమిటీలో చోటు కల్పించారు. 

వసుందర శ్రీనివాస్

 

పిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన జాబితా కింద ఉంది చూడండి.