ఉచిత నీరు కావాలంటే..ఆధార్‌ కార్డు కావాల్సిందే !

జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత తాగునీటి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉచిత తాగునీటి పథకానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నీటి పథకం లో…ప్రతి నెల 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ పథకాన్ని వినియోగించుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు నెంబర్ ను ఈ పథకంలో లింకు చేయాల్సి ఉంటుంది. లేకపోతే, ఉచితం లేనట్లే. డిసెంబర్ చివరి నుంచి కానీ వచ్చే నెలలో కానీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.ఈ క్రమంలోనే తాగునీటి క‌నెక్ష‌న్‌ ఆదర్శం తప్పనిసరి చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేరిట డిసెంబర్ 2 వ తేదీన జీవో విడుదలైంది.

ఉచిత తాగునీరు పొందాలనుకునే వారికి ఆధార్ లేకుంటే… వెంటనే అప్లై చేసి, ఆ రసీదులు అధికారులకు చూపించాల్సి ఉంటుంది.అయితే ఈ నిబంధన కొత్తగా కనెక్షన్ తీసుకున్న వారికా? ప్రస్తుతమున్న కనెక్షన్ దారులంద‌రికా? అనే విషయంపై జీవో లో స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? అనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు.