జైషే ఉగ్ర సెంటర్ ఇదే… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చంపింది వీళ్లనే

పాక్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ సెంటర్ ను భారత వైమానికి దళాలు పేల్చేశాయి. ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న ఆయుధాల డంప్ ను కూడా భారత్ పేల్చేసింది. మిరేజ్ యుద్ధ విమానాలతో ఈ స్థావరాన్ని నేలమట్టం చేశారు. ఈ కేంద్రంలో సుమారు 200 ఏకే రైఫిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రైఫిళ్లను కూడా వాయుసేన ధ్వంసం చేసింది. ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈ దాడి జరిగిందని వైమానిక దళ నిపుణులు అంటున్నారు.  

ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఇవాళ నిర్వహించిన ఈ దాడిలో కొందరు జైషే ఉగ్రవాదులను టార్గెట్ చేశారు. మౌలానా అమ్మార్‌(ఆఫ్ఘ‌న్‌, క‌శ్మీర్‌లో ఆప‌రేష‌న్‌), మౌలానా త‌ల్లా సైఫ్‌(మ‌సూద్ అజ‌ర్ సోద‌రుడు), ముఫ్తీ అజ‌ర్ ఖాన్ క‌శ్మీర్‌(హెడ్ ఆఫ్ క‌శ్మీర్ ఆప‌రేష‌న్స్‌), ఇబ్ర‌హీం అజ‌ర్‌(ఐసీ814 హైజాక‌ర్‌)లు ఉన్నారు.