2019-2020 మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలివే

2019-2020 మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. 

బడ్జెట్ లోని ముఖ్యాంశాలు

* నరేంద్ర మోదీ సారధ్యంలో సుస్థిర పాలన అందించాం.
* రైతుల పాలన రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
* అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
* ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకెళుతున్న ఇండియా.
* ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం.
* 2018-19 ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం.
* కరెంట్ అకౌంట్ లోటును 5.6 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాం.
* మా ప్రభుత్వంలోనే పెరుగుతున్న ధరల నడ్డి విరిచాం.
* ద్రవ్యోల్బణాన్ని కిందకు తెచ్చేందుకు ఎన్డీయే కృషి ఫలించింది.
* మా పాలనలో దేశం మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కింది.
* నిర్ణయాలు తీసుకోలేని దశ నుంచి ఆత్మవిశ్వాసం దిశగా పరుగులు పెడుతున్నాం.
* రూ. 3 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రికవరీ చేశాం.
* బ్యాంకులకు రూ. 2.60 లక్షల కోట్ల మూలధన నిధులను అందించాం.
* ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి.
* అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీదే.
* ‘స్వచ్ఛభారత్’ను అత్యంత విజయవంతం చేశాం.
* అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
* ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం రూ. 60 వేల కోట్ల కేటాయింపులు.
* గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు.
* గడచిన నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం.
* మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ సరఫరా.
* ఎల్ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లను ఆదా చేశాం.
* ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో పేద, మధ్య తరగతి ప్రజలకు రూ. 3 వేల కోట్ల ఆదా.
* కొత్తగా ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులను తీసుకువచ్చాం.
* హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.
* 22 రకాల పంటలకు మద్దతు ధరను పెంచాం.
* ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు ధనసాయం.
* ప్రతి ఏడాదీ పెట్టుబడి సాయం అందిస్తాం.
* మూడు ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది.
* చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు.