భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 2024 జూన్లో బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్న వీరు వారం రోజుల్లోనే భూమికి తిరిగి రావాల్సి ఉండగా, వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల ఇది ఆలస్యం అయింది. చాలా సార్లు రాకెట్ ప్రయోగాలను ప్రణాళికలో పెట్టినా, సమస్యలు ఎదురుకావడంతో వారి భూమికి రాక వాయిదా పడుతూ వచ్చింది. ఇక, చివరకు ఇప్పుడు ఫాల్కన్ 9 రాకెట్ వీరిని తీసుకురావడానికి నింగికెగసింది.
నాసా-స్పేస్ఎక్స్ భాగస్వామ్యంతో చేపట్టిన ‘క్రూ-10’ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం ప్రారంభించింది. ముందుగా ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 12న చేపట్టాలని భావించినా, గ్రౌండ్ సిస్టంలో సమస్యలు తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. చివరకు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ లతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ ఇప్పుడు ఐఎస్ఎస్కు చేరుకుంది.
ఇప్పుడు ఈ కొత్త వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి సన్నాహాలు జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, వారు 19న భూమికి ప్రయాణమయ్యే అవకాశం ఉంది. గత 9 నెలలుగా సాంకేతిక సమస్యల కారణంగా తమ రాక వెనుకబడిన నేపథ్యంలో, ఈసారి మిషన్ విజయవంతమవుతుంధని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సునీతా విలియమ్స్ తన అంతరిక్ష ప్రయాణాల్లో ఎన్నో విజయాలను సాధించినా, ఈసారి ఆమెకు ఎదురైన అనుభవం భిన్నంగా ఉంది. ప్రణాళిక ప్రకారం కేవలం వారం రోజుల మిషన్గా మొదలైన ఈ ప్రయాణం, 9 నెలలు సాగిపోయింది. ఇది అంతరిక్ష ప్రయోగాల మీద కొత్త చర్చలకు దారితీస్తోంది. సాంకేతిక లోపాలతో వ్యోమనౌకలు ఎలా నిర్ధారణ చేయబడుతున్నాయో, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎలా నివారించవచ్చో అనే అంశాలపై నాసా, బోయింగ్ మరింత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.