Shubhanshu Shukla: అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమైన భారత వాయుసేన అధికారి

భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మరో గర్వకారణమైన ఘట్టం ప్రారంభమవుతోంది. భారత వాయుసేన అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లేందుకు సిద్ధమయ్యారు. యాక్సియమ్ మిషన్-4లో భాగంగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.

మే 29న, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుక్లా బృందం నింగిలోకి వెళ్లనుంది. శుభాంశు శుక్లా నాయకత్వంలోని బృందంలో మిషన్ కమాండర్‌గా మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు సభ్యులుగా ఉన్నారు.

ఈ ప్రయాణం భారత కాలమానం ప్రకారం మే 29 రాత్రి 10:33 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మిషన్‌ను అమెరికా నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత శుక్లా బృందం అక్కడ 14 రోజులపాటు శాస్త్రీయ పరిశోధనలు, వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రత్యేకంగా స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి, బయో-మాన్యుఫాక్చరింగ్, బయో-ఆస్ట్రోనాటిక్స్ రంగాల్లో ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు భవిష్యత్ భారతీయ మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టులు, గగన్‌యాన్ మిషన్‌కు కీలక మద్దతుగా నిలవనున్నాయి.

ఈ ప్రయాణం భారత అంతరిక్ష రంగానికి పెద్ద విజయానికి నాంది పలుకనుంది. మనదేశం నుంచి మరిన్ని వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇదొక మైలురాయిగా భావిస్తున్నారు. శుభాంశు శుక్లా అద్భుతమైన నైపుణ్యంతో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తన స్థానం మరింత బలపడాలని ఆశిస్తున్నారు.

జిప్‌లైన్ ఆపరేటర్‌ కు ముందే తెలుసా.? || NIA summons ZIP Operator over Pahalgam Attack || TR