బేవకూఫ్ గాళ్లు, బుద్దిలేదు.. ఆలంపూర్ లో నోరు జారిన కేసీఆర్ (వీడియో)

ఆలంపూర్ సభలో సీఎం కేసీఆర్ గరం గరమయ్యారు. సీఎం కేసీఆర్ ఆలంపూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఓ వైపు నుంచి కార్యకర్తలు ఈలలు వేస్తూ కేకలు పెట్టారు. దీంతో కేసీఆర్ వెంటనే ఆగ్రహంతో వారిని తిట్టారు. ఈ సమయంలో ఎంపీ జితేందర్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఆయన పై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలంపూర్ లో కేసీఆర్ ఏమన్నారంటే..

అరే ఏమరుస్తర్ర బై.. బేవకూఫ్ గాళ్ల లేకుర్రు అంతా.. బుద్దిలేదు..జనం వినొద్దా.. ఒక పదినిమిషాలు సైలెన్స్ గా ఉండొద్దా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఎంపీ జితేందర్ రెడ్డి ఉత్సాహంతో సారు అని చెప్పగా ఆయన పై కూడా కోపంగా చూస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో ఉన్న వారంతా ఒకసారిగా షాక్ తిన్నారు.   

 

 

రేవంత్ రెడ్డి అరెస్టు పై హైకోర్టు సీరియస్ అయింది. అదే సమయంలో కేసీఆర్ ఆలంపూర్ సభలో ఉన్నాడు. దీంతో కేసీఆర్ అసంతృప్తితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.