విమానంలో తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన గవర్నర్ తమిళిసై..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈమె రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్ గా చేశారు. ఇక ప్రస్తుతం ఆ వృత్తికి దూరంగా ఉంటూ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఆ సందర్భంలో ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో బయలుదేరారు.

ఆ సమయంలో ఆ విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి అస్వస్థకు గురయ్యారు. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికులలో డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్ చేయగా వెంటనే తమిళిసై స్పందించటంతో ఆ ప్రయాణికుడికి ప్రాథమిక వైద్య సేవలు అందించి కాపాడారు. ఇక అతడు కోలుకున్నాక ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ తర్వాత తమిళిసై విమాన సిబ్బంది లకు కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. విమానం బయలుదేరే సమయంలో ప్రయాణికులలో ఎవరైనా డాక్టర్లు ఉంటే ముందుగానే చార్టులో విషయాన్ని తెలియజేయాలని సూచించారు. ఇక అస్వస్థకు గురైన వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయగలిగే సిబ్బందికి అవగాహన కల్పించాలి అని తెలిపారు.