జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమరానికి స్టార్‌ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ పార్టీ

bjp party released their star campaign list for GHMC elections

హైదరాబాద్‌: బీజేపీ పార్టీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల అభ్యర్థుల జాబితాతో పాటుగా ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్ల లిస్ట్ ని కూడా ప్రకటించింది. మొత్తం పది మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారికి జాబితాను అందించింది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి కిషన్‌ రెడ్డి మినహా ఇతర కేంద్ర మంత్రులు రానట్లుగా తెలుస్తోంది.

bjp party released their star campaign list for GHMC elections
bjp party released their star campaign list for GHMC elections

ఈ ఎన్నికలకి సంబంధించి అన్ని విషయాల్లోనూ బీజేపీ ఆచూ తూచి వ్యవహరిస్తోంది. మొత్తం అభ్యర్థులను ప్రకటించకుండా.. ఇతర పార్టీల అసంతృప్తుల కోసం ఎదురు చూస్తోంది. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని వారిని ఎన్నికల బరిలోకి దించనుంది. తాజాగా ఇద్దరు సిట్టింగ్‌ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. రామచంద్రపురం సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌, వెంగల్‌రావునగర్‌ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ మనోహర్‌ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ అతనికి వెంగల్‌రావ్‌నగర్‌ టిక్కెట్‌ ఇచ్చింది.

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే :

కిషన్‌ రెడ్డి (కేంద్ర మంత్రి)
బండి సంజయ్‌ ( రాష్ట్ర అధ్యక్షుడు)
రఘునందన్‌రావు (దుబ్బాక ఎమ్మెల్యే)
డీకే అరుణ
లక్ష్మణ్‌
మురళీదర్‌ రావు
వివేక్‌
గరికపాటి మోహన్‌రావు
ధర్మపురి అరవింద్‌
రాజాసింగ్‌(గోషామాల్‌ ఎమ్మెల్యే)