అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉండనుంది. మొదట ఒక సినిమాగానే మొదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు రెండు భాగలుగా చేయాలని నిర్ణయించారు. మారిన ప్లాన్స్ మేరకు మొదటి భాగం షూటింగ్ చాలావరకు పూర్తికాగా ఇంకాస్త మాత్రమే బాకీ ఉంది. ఈ మిగిలిన చిత్రీకరణ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేయాలని నిర్ణయించారు. అల్లు అర్జున్ కూడ చేయవలసిన ప్రాజెక్ట్స్ వెనకబడిపోతూ ఉండటంత వీలైనంత త్వరగా ‘పుష్ప’ను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
అందుకే 45 రోజుల గడువు విధించుకున్నారు. ఈ 45 రోజుల్లో ప్యాచ్ వర్క్ సహా అంతా పూర్తిచేయాలని డిసైడ్ అయ్యారు. దర్శకుడు సుకుమార్ సైతం ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో త్వరగా సినిమాను ఫినిష్ చేసే తొందర్లో ఉన్నారు. ఈరోజే సికింద్రాబాద్లో చిత్రీకరణను రీస్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ సైతం షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ కావాలనేది అల్లు అర్జున్ డ్రీమ్. అందుకే పలు భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇది ముగియగానే అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా పనుల్ని మొదలుపెడతాడు. సుకుమార్ ఏమో ‘పుష్ప-2’కు శ్రీకారం చూడతారు.