గోవాలో మహేష్ డిష్యుమ్…డిష్యుమ్

Sarkaru Vaari Paata movie new schedule started in goa today

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుత రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత ఒకప్పటి మహేష్ ని చూస్తున్నట్లుగా ఆయన స్టైల్, లుక్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి.ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా జరుగుతున్నషెడ్యూల్ కంప్లీట్ అవటంతో చిత్ర యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెంటనే గోవా చెక్కేసింది. గోవాలో ఇవాళ షూటింగ్ షురూ చేసినట్లుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్ల దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నారట.

Sarkaru Vaari Paata movie new schedule started in goa today

 

ఈ చిత్రంలో మహేష్ సరసన టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. టీజర్ చూసిన వారంతా ఈ ఇద్దరి పెయిర్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతాన్ని సమకురుస్తున్నాడు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పరుశరాం దర్శకత్వంలో మహేష్ నటిస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా వెల్లడించారు.