RISAT-1B: నింగిలోకి రిశాట్-1బి: రాత్రుళ్ళు కూడా శత్రువు కదలికలపై నిఘా

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మే 18న శ్రీహరికోట నుంచి రాడార్ ఆధారిత నిఘా ఉపగ్రహం రిశాట్-1బి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం ద్వారా భారత్ రక్షణ రంగానికి మరింత బలాన్ని కలిగించనుంది. ఏ వాతావరణంలోనైనా, రాత్రింబగళ్లు కూడా భూమిపై మార్పులను స్పష్టంగా గుర్తించే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది.

రిశాట్-1బి అత్యాధునిక సి-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్‌తో రూపొందించబడింది. ఇది మేఘాలు, పొగమంచు, చీకటి అన్నదీ లెక్కచేయకుండా పనిచేస్తుంది. శత్రు ప్రాంతాల్లో కదలికలు, కొత్త శిబిరాల ఏర్పాట్లు వంటి సమాచారాన్ని అత్యంత క్లారిటీతో అందించగలదు. ప్రత్యేకించి పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది.

ఈ ఉపగ్రహం కలిగిన ఐదు రకాల ఇమేజింగ్ మోడ్‌లతో సైనిక అవసరాలు మాత్రమే కాదు, పౌర ప్రయోజనాలకు కూడా వినియోగించవచ్చు. వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, భూకంప అనంతర సహాయక చర్యలు, వరద ప్రాంతాల పరిశీలన వంటి వాటికి ఇది సహాయపడనుంది. ఇందులో అత్యంత కచ్చితమైన అల్ట్రా హై-రిజల్యూషన్ కెపాసిటీ ఉండటంతో భూమిపై చిన్న వస్తువులు కూడా కనిపెట్టే సామర్థ్యం కలిగింది.

ఇంతకు ముందు బాలాకోట్ దాడి వంటి ఘట్టాల్లో ఉపయోగించిన రిశాట్ సిరీస్‌కు ఇది కొనసాగింపు. ఇప్పటికే సేవలందిస్తున్న కార్టోశాట్, రిసోర్స్ శాట్ వంటి ఉపగ్రహాల డేటాతో కలిపి దీన్ని పనిచేయించేలా డిజైన్ చేశారు. భూ పరిశీలన కోసం ఇది ఒక సమగ్ర నెట్‌వర్క్‌కి దోహదం చేయనుంది. నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడంలో రిశాట్-1బి భారతదేశానికి నింగిలో కళ్లుగానీ, భద్రతకు రక్షణ కవచంగా నిలవనుంది. ఇది ప్రయోగానికి సిద్ధమవుతోంటే, భద్రతా వ్యవస్థలు దీని సేవలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

తుస్సుమంటున్న చైనా ఆయుధ పరికరాలు..| China Weapons Fail During IND Vs Pakistan War | Telugu Rajyam