వైఎస్ జగన్ నిద్రపోవాలి అంటే… అచ్చెన్నాయుడు అంత మాట అనేశాడేంటి ?

Atchannaidu gave strong reply to ys jagan

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో దేవాలయాలలో జరుగుతున్న దాడుల అంశం మీద తాజాగా జరిగిన అమ్మఒడి ప్రారంభంలో సిఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నెల్లూరు అమ్మఒడి సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష పార్టీలు దేవాలయాలను ధ్వంసం చేసి పరిశీలనకు వెళ్తున్నాయన్నన్న జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. బడులు మీద దాడులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ శ్రీరంగ నీతులు చెప్తున్నారు అని విమర్శిస్తున్నారు. మీ దాడులు లక్ష్యం బడులపై పెట్టి ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. తెల్లారి లేస్తే రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం జరిగేతేనే మీకు నిద్ర పడుతుంది అని ఆయన ఎద్దేవా చేసారు.

Atchannaidu gave strong reply to ys jagan
Atchannaidu gave strong reply to ys jagan

ప్రజలు మీకు సుపరిపాలన చేయటానికి అవకాశం ఇస్తే, మీ పాలన విద్వంసంతో ప్రారంభమైంది అని ఆయన అన్నారు. ప్రజా వేదిక కూల్చి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి మీది అని ఆయన మండిపడ్డారు. 140 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరోజైనా స్పందిచావా? అని నిలదీశారు. నీ కనుసన్నల్లో దేవాలయాలపై దాడులు జరిగాయి అని విమర్శించారు. అందువల్లే దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శన చేయలేదు అని విమర్శించారు. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వస్తుందా? మీ పుట్టిన రోజులు చేస్తే కరోనా రాదా? అని నిలదీశారు. బ్రాందీ షాపులు, స్కూళ్లు తెరిస్తే కరోనా రాదా? బ్రాందీ అమ్మి వాళ్ల రక్తం తాగితే కరోనా రాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఆలయంలో అయినా స్కూల్ లో అయినా ఏ దాడులు జరిగినా కర్త, కర్మ, క్రియగా జగనే ఉంటారు అని అచ్చెన్నాయుడు ఖరాఖండిగా తేల్చేశారు.