జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కు మంత్రి తలసాని సవాల్

సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కు  తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఛాలెంజ్ విసిరారు. వారిద్దరికే కాదు మరికొందరు సినీ ప్రముఖులకు కూడా సవాల్ చేశారు. వారిలో దర్శకులు త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. వీరందరికీ మంత్రి తలసాని ఏం ఛాలెంజ్ చేశారబ్బా అనుకుంటున్నారా? చదవండి.

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మూడు మొక్కలు నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆయన విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను మంత్రి తలసాని స్వీకరించారు. తలసాని మారేడ్ పల్లిలోని తన ఇంటివద్ద మూడు మొక్కలు నాటి సినీ ప్రముఖులైన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.  గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మూడు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తనదే అని తలసాని ప్రకటించారు. 

సినీ ప్రముఖులే కాదు సుమీ టిటిడి చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కు కూడా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు తలసాని. మరి ఈ ప్రముఖులు తలసాని గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తారా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.