ఆ డైరెక్టర్ వల్ల దారుణంగా మోసపోయిన నటి అను ఇమ్మాన్యుయేల్.. అసలేం జరిగిందంటే?

Anu Emmanuel

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని సరసన నటించిన మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అను ఇమ్మాన్యుయేల్.చూడ చక్కని అందం అద్భుతమైన నటనను కనబరిచే ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని భావించినప్పటికీ అదృష్టం కలిసి రాక ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా ఈమె అల్లు శిరీష్ నటించిన ఊర్వసివో, రాక్షసివో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ను నమ్మి తాను దారుణంగా మోసపోయానని తనకు జరిగిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈమెతో పాటు నటి కీర్తి సురేష్ కూడా నటించారు. త్రివిక్రమ్ ఒక సినిమా కోసం పనిచేస్తున్నారు అంటే ఆ సినిమాలో సెలబ్రెటీల రేంజ్ కూడా మారిపోతుందని అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ పనిచేయడంతో అందరి హీరోయిన్ల మాదిరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడంతో తన అదృష్టం కూడా మారిపోతుందని ఈమె గుడ్డిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను నమ్మి అతనిపై నమ్మకంతో అజ్ఞాతవాసి సినిమాలో నటించిందని చెప్పుకొచ్చారు.అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో కేవలం త్రివిక్రమ్ పై నమ్మకంతోనే తను సినిమాలో నటించాలని అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తాను పూర్తిగా మోసపోయానని ఈమె వెల్లడించారు.