పవర్ స్టార్ సినిమా కోసం సిద్దమవుతున్న సాయి పల్లవి.. ప్ర‌త్యేక పాత్ర‌లో అలరిస్తుంద‌ని టాక్

ప్రస్తుతం ఉన్న గ్లామర్ ప్రపంచంలో కేవలం తన అభినయంతోనే ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైమ్ లోనే అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ లోనూ తన కంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. సాయి పల్లవి అంటే యూత్ లోనూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. తన అందం.. అభినయం.. డాన్స్.. ఇలా అన్నింటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దినట్లు చేయడం ఆమె ప్రత్యేకత. అలాగే ఇండస్ట్రీలో సినిమాల్ని ఎంచుకోవడంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. కేవలం కథకు ప్రాథాన్యత ఇచ్చే సినిమాలపై దృష్టి పెడుతుంది ఈ భామ.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇటీవల రిలీజైన లవ్ స్టోరీ టీజర్ కి కూడా మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవికి హీరోయిన్ గా అవకాశం లభించింది. అయితే మొదట్లో ఈ సినిమా ఆఫర్ ని సాయి పల్లవి తిరస్కరించిందంటూ కొన్ని వదంతులు వచ్చాయి. మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ హైబ్రిడ్ పిల్ల పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ లో సైన్ చేసినట్లు.. సినిమా కోసం డేట్స్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు సాయిపల్లవి.. రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.