తులసి మొక్కకు ఏ సమయంలో నీరు పోయకూడదో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల మొక్కలను దైవ సమానంగా భావిస్తాము. ఈ క్రమంలోనే దైవ సమానంగా భావించే మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణంలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి రోజూ ఉదయం సాయంత్రం చాలా మంది తులసి మొక్కకు దీపారాధన చేసి ఆరాధిస్తూ ఉంటారు.అయితే తులసి మొక్క విషయంలో చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులసి మొక్కకి నీరు పొసేటప్పుడు చాలామంది వారికి తోచిన సమయంలో నీళ్లు పోస్తూ ఉంటారు.

తులసి మొక్కకు నీరు పోసే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కకు నీరు పోయడం అశుభానికి సంకేతం. మరి తులసి మొక్కకు ఎప్పుడు నీళ్లు పోయకూడదు, ఎప్పుడు పోయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం…

ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు.అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం చాలా మంది తులసి మొక్కకు నీరు పోసి పూజ చేస్తుంటారు. అయితే సంధ్యాసమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. సాయంత్ర సమయంలో తులసి మొక్క క్రింద విష్ణుమూర్తి లక్ష్మి దేవి సేదతీరుతూ ఉంటారని, అందుకే సాయంత్ర సమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. అదే విధంగా పౌర్ణమి అమావాస్య సూర్య చంద్ర గ్రహణాల సమయంలో నీళ్లు పోయకూడదు.

తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచ కూడదు. తులసి చెట్టులో ఎండిపోయిన ఆకుల ఉంటే తక్షణమే తులసి మొక్కను తొలగించి ఎవరూ తొక్కని ప్రదేశములో పడేసి దాని స్థానంలో కొత్తది నాటాలి. ఈ విధంగా ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో అశుభాన్ని సూచిస్తుంది. శాస్త్రం ప్రకారం ఆదివారం ఏకాదశి రోజులలో తులసి మొక్కను పొరపాటున కూడా తాకకూడదు. అయితే ఆరోజు తులసి మొక్కకు పూజ చేయడం ఎంతో శుభప్రదం. ఇక చాలామంది తులసి ఆకులను గోళ్లతో గిల్లుతూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. అలాగే స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు.