అమిత్ షాను కూడ వదలని కరోనా మహమ్మారి 

Amit Shah
దేశంలో సామాన్యులే కాదు వీఐపీలు, వీవీఐపీలు కూడ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.  వీరిలో ఎక్కువగా రాజకీయ ప్రముఖులే ఉండటం గమనార్హం.  తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.  లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలింది.  ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా తెలిపారు.  వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.
 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  వీలైనంత వరకు కేవలం అత్యవసర కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ బాద్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయనకు కోవిడ్ సోకింది.  నిన్న నిర్వహించిన బాల గంగాధరతిలక్ 100వ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జరిపిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ షా పాల్గొనడంతో ఆ కార్యక్రమానికి హాజరైన వారందరనీ ఐసోలేషన్లోకి వెళ్లాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.  ఇకపోతే ఈ సంగతి తెలిసిన ప్రముఖులంతా అమిత్ షా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పంపుతున్నారు.