49 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం భారతీయ పనోరమ ప్రధాన విభాగంలో మహానటి సినిమా ఎంపికయ్యింది .గోవా లో జరిగే ఈ అంతర్జాతియ చలన చిత్రోత్సవం పనోరమా విభాగంలో 13 మంది సభ్యులున్నారు . చైర్మన్ గా మేజర్ రవి , సభ్యులుగా అహతియాన్ , ఉజ్జ్వల్ ఛటర్జీ , ఇమో సింగ్ , ఉత్పల్ దత్ , శేఖర్ దాస్ , మహేంద్ర తెరేదేశాయి , హైదర్ అలీ , కె జి . సురేష్ , చంద్ర సిద్దార్థ , అదీప్ టాండన్ , ఎస్ . విశ్వనాధ్ వున్నారు .
ఈ కమిటీ భారత దేశంలో వున్నా వివిధ భాషల్లో వచ్చిన వాటి నుంచి 22 చిత్రాలను ఎంపిక చేసింది . వీటిల్లో “ఓలు” అనే మలయాళ సినిమా పనోరమా ప్రారంభ సినిమాగా ఉంటుంది . మిగతా చిత్రాల్లో బెంగాలీ సినిమా నాగరికిటన్ , సా , ఉమా , అబ్యాక్తో , యూరోన్చోండి ,హిందీ నుంచి అక్టోబర్, బోర్ , జేసారా నుంచి సింజార్ ,లడఖి నుంచి వాకింగ్ విత్ ది విండ్ , మలయాళం నుంచి భయానకం , మక్కన ,పూమరం , సుందని ఫ్రొం నైజీరియా , ఈ మా యోవే , మరాఠీ నుంచి దప్ప , అంభి దొఘి , తమిళం నుంచి టు లెట్ , భారం , పెరియరుమ్ పెరుమాళ్ బి ఏ ,బి ఎల్ , పెరంబు , తులు నుంచి పెద్దయి ఎంపికయ్యాయి .
ఇక ప్రధాన విభాగంలో ప్రదర్శనకు తెలుగు భాష నుంచి మహానటి సావిత్రి జీవితం పై నిర్మించిన నాగ్ అశ్విన్ ” మహానటి ” హిందీ నుంచి “టైగర్ జిందా హై “. “పద్మావతి “, “రాజీ ” చిత్రాలు ఎంపికయ్యాయి .