మిర్యాలగూడ అమృత వర్షిణి మరో కీలక నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరువు హత్య కేసులో మృతుడు ప్రణయ్ భార్య అమృత న్యాయం కోసం పోరాటాన్ని ప్రారంభించింది. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని.. ముఖ్యంగా ప్రణయ్‌ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసింది.

తాను మరో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని, పుట్టింటికి కూడా వెళ్లనని అమృత శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమృత న్యాయం కోసం సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించింది. అన్నట్టుగానే అమృత ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరిట ఫేస్‌బుక్‌ పేజీ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది. ఫేసుబుక్ పేజి ప్రారంభించిన రెండు గంటల్లోనే  7200  మంది ఫాలోవర్సయ్యారు. 

పరువు, కుల పిచ్చితో ప్రణయ్‌ను చంపిన అమృత తండ్రి మారుతీరావును, హత్యకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌, సుఫారీ కిల్లర్స్‌తో పాటు హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమృత వర్షిణి ప్రారంభించిన ఫేసుబుక్ పేజి లింక్ కింద ఉంది. దానిని ఫాలో అయ్యి మీరు కూడా మీ మద్దతు ప్రకటించవచ్చు

 

https://www.facebook.com/Amruthapranayperumalla/?__tn__=HHH-R