అగ్రనటుల పారితోషకంపై చర్చ… అభిమాన సంఘాల మధ్య పెరిగిన పోటీ!?

అగ్ర నటుల అభిమానులు వారి నటులపై వున్న అభిమానంతో వాగ్యుద్ధం చేసుకోవటం కొత్తేవిూ కాదు కానీ, ఈ సామాజిక మాధ్యమం వచ్చాక మరీ ఎక్కువయిపోయాయి. ఈ అభిమానుల వార్స్‌ అనేవి ఒక్కోసారి ఒక్కో రకంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అప్పట్లో అగ్ర నటుల అభిమానుల మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం నడుస్తూ వచ్చేది.

ఇప్పుడైతే అది ముదిరి మొదటిరోజు ఓపెనింగ్స్‌ వరకు వచ్చేసింది. అది కూడా దాటిపోయి ఇప్పుడు ఇంకో కొత్త కోణంలో ఈ అభిమానుల మధ్య వార్‌ మొదలయ్యింది. అదేంటి అంటే, అభిమానుల మధ్య వినిపిస్తున్న ప్రధాన పోటీ తమ అభిమాన నటుల పారితోషికం గురించి. ఇప్పుడు ప్రతి అగ్ర నటుడు తమ సినిమా ఒక్క భాషలో కాకుండా మొత్తం ఇండియా అంతా విడుదల చెయ్యాలని దానికి తగ్గట్టుగా పారితోషికాలు కూడా తీసుకుంటున్నారు.

అలా చాలామంది నటుల మార్కెట్‌ కూడా బాగా విస్తరించింది కూడా. దానికి తగ్గట్టుగా ఆయా నటుల పారితోషికాలు కూడా బాగా పెరిగిపోయాయి. దక్షిణాదిలోనే ఇలా చాలామంది అగ్ర నటులకి అభిమాన సంఘాలు ఉండటం, వాళ్ళు తమ నటుడి గురించి సామాజిక మాధ్యమంలో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది.

ఇలా పారితోషికాలు విషయంలో తమిళ సూపర్‌ స్టార్స్‌ రజనీకాంత్‌, విజయ్‌ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో విపరీతంగా వాగ్యుద్ధం జరుగుతోంది. తెలుగు నటుడు ప్రభాస్‌ పారితోషికంగా రూ.150 కోట్లు తీసుకుంటూ దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడిగా ఉండేవారు అనేవారు.

అలాగే తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ కు ‘వారసుడు’ సినిమాకి గాను రూ.120 కోట్లు ఇచ్చారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్‌ పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది అని, తాను చెయ్యబోయే ఆఖరి సినిమాకి అతని పారితోషికం రూ. 250 కోట్ల వరకు ఉందని విజయ్‌ అభిమానులు చెపుతున్నారు. సినిమాలు మానేసి రాజకీయాల్లో పూర్తిగా కేటాయించడానికి విజయ్‌ చేయబోయే ‘ఆఖరి’ సినిమాకు రూ. 250 కోట్ల పారితోషికం అని అభిమానులు చెపుతున్నా, ఈ సినిమాపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా, ఉండదా, ఉంటే దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా ఇంకా ఏవిూ అనుకోలేదు అని తెలిసింది. కానీ విజయ్‌ కి ఎలివేషన్‌ ఇచ్చేందుకు అతని అభిమానులు దేశంలోనే అత్యధిక రెమ్యూనిరేషన్‌ తీసుకుంటున్నది తమ నటుడే అని చెప్పుకుంటున్నారు.