ఫాల్కే ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ‘పొలిమేర-2’ ఎంపిక!?

చిన్న సినిమాగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది ‘మా ఊరి పొలిమేర’. దీనికి కొనసాగింపుగా ‘పొలిమేర2’ ను తెరకెక్కించారు. తాజాగా ఈ సీక్వెల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినీ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అధికారికంగా ఈ విషయం ప్రకటిస్తూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. ’ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ఆదరణతోనే ఇది సాధ్యమైంది’ అని తెలిపారు.

దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. దిల్లీ వేదికగా త్వరలోనే ఈ అవార్డుల వేడుక జరగనుంది. ‘మా ఊరి పొలిమేర’లో సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రలు పోషించారు .తొలి భాగం నేరుగా ఓటీటీ (డిస్నీ,హాట్‌స్టార్‌)లో విడుదల చేయగా రెండో భాగాన్ని థియేటర్లలో విడుదల చేసి కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. చేతబడి ఇతివృత్తంగా ఈ రెండు సినిమాలను డాక్టర్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించారు. ఈ కైమ్ర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూడో భాగం కూడా త్వరలోనే రానుంది.