ప్రభాస్ ‘సలార్’ మీద కొత్త రూమర్ ?

prabhas movie salaar will be released as two parts

ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ గురించి టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డార్లింగ్ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ మీద విపరీతమైన హైప్ ఏర్పడింది. పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను మొదట ఒకటే పార్ట్ గా అనుకున్నప్పటికీ ఇప్పుడు రెండు పార్ట్ లుగా తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

prabhas movie salaar will be released as two parts

రెండు భాగాలుగా చేస్తేనే బిజినెస్ పరంగా సెట్ అవుతుందన్న అంచనాతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అధికారక ప్రకటన వెలువడేంతవరకు ఇదొక రూమర్ గా తీసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు ఎక్కువగా తమ ప్రాజెక్ట్స్ ని పార్ట్స్ గా తీసి క్యాష్ చేసుకుంటున్న నేపథ్యంలో సలార్ మీద వస్తున్న ఈ రూమర్ నిజమవుతుందని అందరూ అనుకుంటున్నారు.

ఈ ట్రెండ్ ని రాజమౌళి తన “బాహుబలి” మూవీతో స్టార్ట్ చేశాడు. ఇటీవలనే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా అల్లు అర్జున్ తో తీస్తున్న “పుష్ప” మూవీ ని కూడా రెండు భాగాలుగా చేస్తున్నట్లు ప్రకటించటం జరిగింది. మూవీ షూటింగ్‌లకు అనుమతి రాగానే మొదటిగా సలార్ మూవీని కంప్లీట్ చెయ్యాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఈ మూవీలో డార్లింగ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది.