అలర్ట్… మార్చి ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్న కొత్త నిబంధనలు!

సాధారణంగా బ్యాంకింగ్, గ్యాస్, ఈపీఎఫ్ వంటి అనేక వాటి గురించి ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెల ఆఖరికి చేరుకుంది. మార్చి నెల ప్రారంభంతో కొన్ని అంశాల మీద నిబంధనలు మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా నిబంధనలు మారడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల నిబంధనల మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి మార్చి నెలలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

• బ్యాంకు రుణాలు: మార్చి నెలలో బ్యాంకు రుణాల పై నిబంధనలు మరనున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. అయితే రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. దీంతో మార్చి 1 నుంచి కొంత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు సామాన్యులకు మరింత భారం కానున్నాయి.

• ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎస్బిఐ కార్డు కొత్త చార్జీలను ప్రకటించింది. ప్రకటన ప్రకారం పెంచిన కొత్త ఛార్జీలు మార్చి 17, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లింస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అదనంగా ట్యాక్స్‌ సైతం ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.99గా ఉండేది. ఇప్పుడు డబుల్‌ చేసింది.

• ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు: ప్రజలకు నిత్యవసర వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతినెల ఒకటో తేదీన ఆయిల్‌ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. అలాగే మార్చి 1న గ్యాస్‌ సిలిండర్ ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు.

• ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అధిక పెన్షన్‌ పొందే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ కల్పించింది. దీంతో అర్హులైన వారందరూ కూడా మార్చి మూడవ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

• సోషల్‌ మీడియా ఫిర్యాదులు: ఇక సోషల్ మీడియా కి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు ఫిర్యాదులు అప్పీలేట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. ఈ కమిటీల ద్వారా సోషల్ మీడియాలకు సంబంధించిన ఫిర్యాదులు కేవలం 30 రోజుల్లోనే పరిష్కరించబడతాయి.