లోకేష్ పై అలా… కేటీఆర్ పై ఇలా… పవన్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో ఎదగాలంటే అంత ఆషామాషీ కాదన్నారు. వారసత్వంగా తీసుకునేందుకు పదవులేమైనా ఆస్తులా అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు తెలిసినవాళ్లు, ప్రజాక్షేత్రం నుంచి రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలన్నారు.

మంత్రి కేటీఆర్ కు పోరాటం చేసిన అనుభవం ఉందని ఆయన ప్రజల్లో గెలిచారన్నారు. లోకేష్ కు ముఖ్యమంత్రి అయ్యే అనుభవం ఎక్కడ ఉందని పవన్ ప్రశ్నించారు. వాళ్ల తాత 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారని పవన్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు వెళ్లానని గిరజనులు జగన్ లా వేల కోట్లు అడగడం లేదని తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ల కావాలంటున్నారని పవన్ అన్నారు. జనసేన విజన్ డాక్యుమెంటరీలో తెలంగాణ అంశాలను కూడా చేరిస్తే సంతోషించే వాడినని పవన్ అన్నారు.

లోకేష్ కేటీఆర్ లపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేటిఆర్ ను సపోర్ట్ చేస్తూ లోకేష్ ను విమర్శిస్తూ పవన్ వ్యాఖ్యలు చేయడంతో ఇరు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.