చిరు చెవిన పడినట్లుంది…ఖండిస్తూ ప్రకటన

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత చిరంజీవి… ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూ వచ్చాయి. క్రితం సంవత్సరం నవంబర్, డిసెంబర్ లలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారనే వార్తలు కూడా వినిపించాయి.

అయితే త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసినప్పటి నుంచీ.. కొరటాల శివతో మూవీ ఉండటంలేదని, అది ఇంకా లేటు కానుందని ఏవేవో రూమర్స్‌ మొదలయ్యాయి. అయితే ఇవన్నీ చిరంజీవి, కొరటాల చెవిన పడినట్లున్నాయి. వీటన్నంటిపై కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అఫీషియల్ గా ఓ ప్రకటనను విడుదల చేశాయి.

ఈ రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం.. సైరా పూర్తైన వెంటనే ప్రారంభం కానుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఈ చిత్తరం ఆగిపోయిందని వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారని ఈ మూవీపై వస్తోన్న రూమర్స్‌కు చెక్‌ పెట్టేసి మెగాభిమానులకు ఆనందం కలగచేసారు. కొరటాలతో మూవీ అనంతరం త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు దీన్ని బట్టి అర్దమవుతోంది.

మరో ప్రక్క ఈ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో నటించిన తమన్నా చిరుతో పూర్తిస్థాయి చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందన్న మాట. ‘రచ్చ’ సినిమా రిలీజ్‌ సమయంలో.. తమన్నాతో కలిసి నటించాలని ఉందని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమన్నా ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.