“త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను హీరోగా దానయ్యగారు ఓ సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్ని సెట్ చేసింది రామ్చరణ్. దానయ్యగారితో చరణ్ వరుసగా రెండు సినిమాలు చేయడంతో పాటు నన్ను కూడా ఇరికించారు . త్రివిక్రమ్తో సినిమా చేయాలన్నది నా ఆకాంక్ష. మా కాంబినేషన్లో ఓ చక్కటి సినిమా వస్తుంది.. అది ఎప్పుడొస్తుందా అని నేను కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు చిరంజీవి.
రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం చిరంజీవి రివీల్ చేసారు. తమ్ముడికి ఆప్తుడు అంటూ ఆయన త్రివిక్రమ్ వైపు చూస్తూ చెప్పాలో చెప్పకూడదో తెలియదు గానీ చెప్పకుండా ఉండలేకపోతున్నానని అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి..సురేంద్రరెడ్డి డైరక్షన్ లో సైరా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఎనౌన్స్ చేసిన ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమా చిరంజీవికి 153వది అవుతుంది. ఇవన్నీ చూస్తూంటే చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని, సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.