టిఆర్ ఎస్ ని వదిలేసిన బాలూ నాయక్

 

నల్గొండ జిల్లా లో కాంగ్రెస్ బలసమీకరణ జోరుగా సాగుతూ ఉంది.  జిల్లా కాంగ్రెస్ కంచుకోట.  2014లొ ఇది రుజువయింది. 2019 లో కూడా ఇదే పరిస్థితి కొనసాగించేందుకు పార్టీ బలసమీకరణ చేపడుతూ ఉంది. దీని ఫలితంగా నల్గొండ   పరిషత్ చైర్మన్ బాలు నాయక్  ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వందలాది మంది కార్యకర్తలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ గాం ధీ భవన్ కు వచ్చారు. 

 టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నాయకులు జానా రెడ్డి, ఎమ్యెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు బిక్ష్మమయ్య గౌడ్ తదితరుల సమక్షంలో ఆయనపార్టీ కండువాను కప్పుకున్నారు.

నిజానికి ఆయన కాంగ్రెస్ తరఫునే  జిల్లా పరిషత్ ఛెయిర్మన్ అయ్యారు. అయితే, తెలంగాణలో టిాఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 2014 డిసెంబర్ 30 న ఆయన టిఆర్ఎస్ చేరారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా  పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ లోకి ఆయనను ఆహ్వానించారు.

 ఈరోజు సీన్ రివర్సయింది. బాలానాయక్ ఆ రోజు వెళ్లి పోయిన వారిలో చాలామంది వెంటేసుకుని మళ్లీ కాంగ్రెస్ లోకి  వచ్చారు.  టిఆర్ ఎస్ గెలుస్తుందని , ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ముఖ్యమంత్రి కెసియార్  ధీమాగా ప్రకటిస్తున్న సమయంలో బాలూనాయక్ రూలింగ్ పార్టీని వదిలేసిరావడం ఆశ్చర్యం.

.