రైతులకు చెక్కులు, టిఆర్ ఎస్ కు చెక్…

ఎన్నికల ముందు బతుకమ్మ చీరెలు, రైతు బంధు చెక్కులను పంపిణీ చేసి తెలంగాణలో ఫీల్ గుడ్ ఫీలింగ్ క్రియేట్ చేయాలనుకున్న టిఆర్ ఎస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది.

రైతుబంధు చెక్కులను పంపిణీ మీద ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.  రైతులకు చెక్కులకు పంపిణీ చేయవచ్చని చెబుతూనే టిఆర్ ఎస్ కు చెక్ పెట్టింది. చెక్కుల పంపిణీ సంబురాలను నిషేధించింది.  ఈ కార్యక్రమంలో ఎక్కడా టిఆర్ ఎస్ నేతలు కనిపించడానికి వీళ్లేదని చెప్పింది.

మొన్న బతుకమ్మ చీరెల కానుకల పంపిణీని నిషేధించిన ఎన్నికల కమిషన్ ఇపుడు పబ్లీకును చెక్కుల పంపిణీ ని ఆపేసింది. రైతుబంధు కింద రైతులకు అందించాలనుకుంటున్న ఎకరానికి నాలుగువేల రుపాయలను ఇవ్వండి, దీనికి చెక్కు లను పంపిణి చేయ్య వచ్చని చెబుతూనే డబ్బును బ్యాంకులకు ఎలెక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ చేయమని చెప్పింది. చెక్కుల పంపిణీ పండగ లాగా జరపడానికి వీల్లేదు. దీనితో చెక్కుల పంపిణీలో ఉన్న మజా ఇపుడు టిఆర్ ఎస్ కు దొరక్కుండాపోయింది. డబ్బు చడీచప్పుడు లేకుండా బ్యాంకల్లో రైతుల అకౌంట్లలో పడుతుంది.

అంతేకాదు, దీనికి పబ్లిసిటీ ఇవ్వడం చేయవద్దని చెప్పారు. అంతేనా, కాదు,ఒక్క టిఆర్ ఎస్ రాజకీయ నాయకుడు కూడా ఈ డబ్బు పంపిణీ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని  ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు కమిషన్ చాలా స్పష్టమయిన ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ కె రుదోలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. రాష్ట్రానికి అందించిన సమాచారం ప్రకారం, రైతుబంధు పథకం నిధులను ముందు గుర్తించిన రైతులకే ఇవ్వాలి. కొత్త రైతులను చేర్చడానికి వీల్లేదని కూడా ఆదేశించింది.

కమిషన్ ఈ విషయాల మీద  ముూడు షరతులువిధించింది. అవి: 

1. చెక్కుల మీద ఎలాంటి పబ్లిసిటీ చేయడానికి వీల్లేదు. 
2. చెక్కుులు, కానుకలు, కిట్లు… పంచడానికి వీల్లేదు. వాటికోసం ఎలాంటి పబ్లిక్ పంక్షన్ ఏర్పాటుచేయడానికి వీల్లేదు.
3. టిఆర్ ఎస్ నేతలెవరికీ ఈ డబ్బు పంపిణీ లో ప్రమేయం ఉండరాదు.

ఇలాంటి ఉత్తర్వులు వస్తాయని వూహించి, రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేయడం మొదలు పెట్టడంతో ఎన్నికల కమిషన్ ఆఘమేఘాల మీద శుక్రవారం సాయంకాలం ఈ ఉత్తర్వులను జార చేసింది. ఈ పథకం కింద వ్యవసాయ శాఖ 52 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేసి వాటికి రు.5200 కోట్లుపంపాలని నిర్ణయించింది.

నల్గొండలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ శుక్రవారం నుండి రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు చెక్కలు పంపిణీ కి అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు.శుక్రవారం నాడు పది జిల్లాలలో చెక్కుల పంపిణీ జరిగింది.  సోమవారం నాడు మిగతా జిల్లాలలో పంపణీ చేయాలనుకున్నారు.

(బ్యానర్ ఫోటో, ఈ ఏడాది మే నెలలో ముఖ్యమంత్రి రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తున్నప్పటి ఫోటో.  కర్టసీ తెలంగాణ టుడే )