టిఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు సీఎం కేసీఆర్ రిక్వెస్ట్

టిఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు సీఎం కేసీఆర్ ఓ రిక్వెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఆ రోజు కేసీఆర్ జన్మ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే అంతా సిద్దమయ్యారు. కానీ పుల్వామాలో భారత జవాన్ల పై భారీ దాడి జరగడంతో 40 మంది చనిపోయారు. దీంతో తాను బర్త్ డే వేడుకలు చేసుకోనని, దయచేసి ఎవరూ వేడుకలు నిర్వహించొద్దు… రిక్వెస్ట్ అంటూ కేసీఆర్ ప్రజలను కోరాడు. 

ఆ రోజు రక్తదానం చేయండి, మొక్కలు నాటండి, అవయవదానాలు చేసేందుకు ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.ఇదే విషయాన్ని కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. ట్వీట్టర్ లో కేసీఆర్ ఏమని పేర్కొన్నారో చూడండి.