ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..!

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం చారిత్రాత్మక సంచలన తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్, ఆయనపై అనర్హత వేటు వేస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక గుర్తుపై గెలిచి, ఆ తర్వాత అధికార పార్టీలోకి మారిన ప్రజాప్రతినిధుల వ్యవహారంలో ఈ తీర్పు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

గతంలో దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండానే మరో పార్టీ కండువా కప్పుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. పార్టీల లోపల, వెలుపల ప్రజాప్రతినిధుల ప్రవర్తనను పదో షెడ్యూల్ ప్రకారం నిశితంగా పరిశీలించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఈ కీలక తీర్పును ఇచ్చింది.