YCP Over Reacting On Pawan Kalyan : హైద్రాబాద్ పబ్ అండ్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి నిహారిక విషయమై వైసీపీ శ్రేణులు ఎందుకు అత్యుత్సాహం చూపాయి.? జనసేన కీలక నేత నాగబాబు కుమార్తె నిహారికని పోలీసులు అదుపులోకి తీసుకున్నమాట వాస్తవం. తన కుమార్తె పబ్బుకి వెళ్ళిందిగానీ, ఆమెకు డ్రగ్స్తో సంబంధం లేదని నాగబాబు వివరణ ఇచ్చారు. పోలీసులు, ఆమెకు డ్రగ్స్తో సంబంధం వుందన్న ప్రకటన అయితే చేయలేదు కదా.?
సోషల్ మీడియా వేదికగా నిహారిక మీద విపరీతమైన ట్రోలింగ్ చేసింది వైసీపీ. నిజానికి, ఇది వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారమే. ఈ అతి స్పందన కాస్తా వైసీపీ కొంప ముంచింది. ఎలాగోలా జనసేన పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నదే వైసీపీ లక్ష్యం. అసలంటూ చట్ట సభల్లో సరైన ప్రాతినిథ్యమే లేని జనసేన విషయంలో వైసీపీ అత్యుత్సాహం చూస్తోంటే, జనసేనకు వైసీపీ భయపడుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది.
జనసేన పార్టీ గనుక టీడీపీతో పొత్తు పెట్టుకుని వైసీపీకి నష్టం లేదు. ఆ విషయాన్ని వైసీపీనే కుండబద్దలుగొట్టేస్తోంది. కానీ, జనసేనాని ఏ విషయమ్మీద మాట్లాడినా, ఓ డజనుకు పైగా వైగా వైసీపీ కీలక నేతలు మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై నానా రకాల విమర్శలూ చేస్తారు. వీటివల్ల వైసీపీకి వచ్చే అదనపు ప్రయోజనం లేదు సరికదా, జనసేన పార్టీ మీద జనాల్లో సింపతీ పెరగడానికి కారణమవుతోంది.
కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడానికి జనసేనాని ముందుకొచ్చారు. నిజానికి, వైసీపీ ఈ విషయమై మౌనంగా వుంటేనే మంచిది. కానీ, అలా ఎలా ఇస్తారు.? అని వైసీపీ ప్రశ్నించడమేంటి.? ఇక్కడే వైసీపీ తప్పులో కాలేస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనను లైట్ తీసుకోవడమే వైసీపీకి బెటర్. జనసేన మీద వైసీపీ చేసే ప్రతి విమర్శా.. జనసేన పార్టీకి వచ్చే ఓట్ల శాతాన్ని ఎంతో కొంత పెంచుతుంది. సో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వీలైనంత త్వరగా గుర్తించాలన్నమాట.