Sucharita Breaks Silence : ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అలక వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ‘మంత్రి పదవి రెండున్నరేళ్ళే..‘ అంటూ షరతు పెట్టి మరీ సుచరిత సహా పలువురికి తొలి క్యాబినెట్లో వైఎస్ జగన్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ స్టైలింగ్ ఇది. అయితే, చాలామంది వైఎస్ జగన్ కార్పొరేట్ స్టైలింగ్ని అర్థం చేసుకోలేకపోయారు.
కొత్త క్యాబినెట్ విషయంలో వైఎస్ జగన్ కూడా ముందు చెప్పిన మాటని తూచ్ అనేసి, పాతవారికి చాలామందికి అవకాశం కల్పించారు. దాంతో, పదవులు రిపీట్ అవని కొందరు అలకపాన్పు ఎక్కడారు. వారిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత తదితరులున్నారు.
బాలినేనికి స్వయంగా వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారు. దాంతో ఆయన దార్లోకొచ్చేశారు. సుచరిత విషయంలోనూ అదే జరిగి వుండొచ్చు. ‘మా అమ్మాయి చిన్నపిల్ల. ఆమెకు రాజకీయాల గురించి ఏం తెలుసు.? నేనేమీ రాజీనామా చేయలేదు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో మీడియా ముందుకు రాలేకపోయాను..’ అంటూ ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మేకతోటి సుచరిత చెప్పుకొచ్చారు. (Sucharita Breaks Silence)
‘మాకు పదవి రెండేళ్ళేనని ముఖ్యమంత్రి ముందే చెప్పారు. సో, నేనేమీ ఈ విషయంలో అధినేతను తప్పుపట్టబోను..’ అంటూ సుచరిత వ్యాఖ్యానించడం గమనార్హం.
పాపం మేకతోటి సుచరిత కుమార్తె.. తల్లి ఇలా రాజకీయంగా మాట మార్చేస్తారని తెలియక చాలా హడావిడి చేశారు. నిజమే, రాజకీయాలు అర్థం కాని పసి పాప ఆమె.
