Pawan Kalyan meeting : బండ్ల గణేష్ సంచలన ట్వీట్..జన సునామీ ముందుకు వస్తున్నాడట.!

 Pawan Kalyan meeting : టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు ఏదొక కాంట్రవర్సీ లో ఇరుక్కుంటూ సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో నిలుస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్ అని అందరికీ తెలిసిందే.
అలాగే పవన్ కి సంబంధించి ఏదన్నా సినిమా వేడుక జరిగితే మాత్రం పవన్ తో పాటు బండ్ల స్పీచ్ కోసం అంతా ఓ రేంజ్ లో వెయిట్ చేస్తారు. అయితే పవన్ నటించిన లాస్ట్ సినిమా అయినటువంటి “భీమ్లా నాయక్” కి త్రివిక్రమ్ వల్ల బండ్ల గణేష్ కి ఎంట్రీ కూడా దక్కలేదు. దీనితో బండ్ల కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
కానీ ఈసారి మాత్రం బండ్ల గణేష్ తనని ఆపేది ఎవరూ లేరు అంటున్నాడు. రేపు మార్చ్ 14న జరగబోయే పవన్ రాజకీయ పార్టీ జనసేన పార్టీ జన సునామి మీటింగ్ కి తను కూడా వస్తున్నట్టు తెలిపాడు. “వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి   కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను.
మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అంటూ తన మార్క్ పవర్ ఫుల్ స్పీచ్ లో చెప్పే మాటల్తో ట్వీట్ చేసాడు. దీనితో ఈసారి మాత్రం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సభలో కనిపించడం పక్కా అని చెప్పాలి. మరి తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందో లేదో రేపటి వరకు ఆగి చూడాల్సిందే.
https://twitter.com/ganeshbandla/status/1502844693821808641