Minister Post In AP : ఆ మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది చెప్మా.?

Minister Post In AP

Minister Post In AP :  మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో, ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ షురూ అయ్యింది. ‘మంత్రి పోయిన బాధలో మేమున్నాం..’ అని ఇటీవల సినిమా టిక్కెట్ల వివాదం నేపథ్యంలో ఓ మంత్రి మాట్లాడినా, గౌతమ్ రెడ్డి మరణించిన వార్త వెలుగు చూడగానే, రాజకీయం షురూ అయ్యింది.. పైరవీలు నడుస్తున్నాయ్. రాజకీయాల్లో ఇదంతా మామూలే.!

ఇంతకీ, గౌతమ్ రెడ్డి స్థానంలోకి రాబోయే కొత్త మంత్రి ఎవరు.? కొత్తగా ఎవరికీ మంత్రి వర్గంలో చోటు కల్పించకపోతే, ఆ శాఖలు ఏ మంత్రి చేతిలోకి వెళతాయి.? అన్న ప్రశ్నల చుట్టూ ఆసక్తికరమైన చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.

జిల్లాల విభజన వ్యవహారం ఓ కొలిక్కి రాగానే, మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడతారంటూ చర్చ జరుగుతోంది. అదే నిజమైతే. ప్రస్తుతానికి కొత్తగా ఎవరినీ మంత్రి వర్గంలోకి తీసుకోకపోవచ్చు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

మరి, మంత్రి వర్గ విస్తరణ జరిగాక ఐటీ శాఖ ఎవరికి దక్కుతుంది.? (Minister Post In AP)  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గౌతమ్ రెడ్డి హఠాన్మరనం చెందడంతో, ఆ కోటాలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి.. అదే జిల్లాకి చెందిన రాజకీయ ప్రముఖుడికి మంత్రి వర్గంలో స్థానం దక్కొచ్చు.

అయితే, ఈ పదవి కోసం ఓ మహిళా ఎమ్మెల్యే (వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలే అయినా, సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు) పోటీ పడుతున్నారట. ఈ మేరకు ఆమె విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారట.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపుల కోసం నానా రకాల పాట్లూ పడుతున్నారట. మరి, ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా.? వేచి చూడాల్సిందే.