సిగ్గుందా? నీచుడివి: కెసిఆర్ పై మంత్రి నక్కా ఆనంద్ షాకింగ్ కామెంట్స్

కెసిఆర్ పై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తూ చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానంగా ఆయన ఘాటైన రీతిలో విమర్శలు గుప్పించారు. కెసిఆర్ లాంటి నీచుడు అసలు రాజకీయాల్లో ఉండరన్నారు. సిగ్గుందా నీకసలు? మనిషి మాట్లాడే భాష మాట్లాడుతున్నావా? అంటూ దుయ్యబట్టారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబుపై కెసిఆర్ విమర్శలు చేస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే పూర్తిగా కింద ఉంది చదవండి. 

కెసిఆర్ రెండు రోజుల నుండి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నటువంటి భాష రాజకీయాల్లో దిగజారుడు వ్యవహారానికి పరాకాష్ట. బహుశా ఈ దేశంలోనే ఇటువంటి నీచమైన భాష, చీప్ ట్రిక్స్ ప్లే చేసే కెసిఆర్ లాంటి రాజకీయ నాయకుడు ఉండడేమో. కెసిఆర్ నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎం గా ఉన్నారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జాతీయస్థాయి రాజకీయాల్ని తనదైన శైలిలో నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు. ఆయన మీద కెసిఆర్ ఎటువంటి అవాకులు, చవాకులు పేలుతున్నాడో ఉభయ రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు.

ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతోనే అటువంటి ప్రేలేపనలు చేస్తున్నాడు. హాఫ్ పెర్సెంట్ టిడిపి కి ఓట్లు లేవంటున్నాడు. హాఫ్ పెర్సెంట్ ఓట్లు లేకపోతే ఇవాళ నువ్వు టిడిపి ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నీ మోసపూరిత విధానాలన్నీ అందరికి తెలుసు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. నీ కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టుకుంది నువ్వు. ఈ పార్టీ ద్వారా పైకొచ్చి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని జనం అనుకుంటున్నారు. 2001 వరకు టీడీపీలోనే ఉన్నావు. నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే 2001 తర్వాత టిడిపి నుండి బయటకు వెళ్లి టీఆరెస్ పార్టీ పెట్టుకున్నావు.

పార్టీలు మారడం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుందా నీకసలు? మనిషి మాట్లాడే భాష మాట్లాడుతున్నావా నువ్వసలు? మూడో కన్ను తెరుస్తా అన్నావు. ఎందుకు ఉన్నాయి నీకు మూడు కళ్ళు? మనుషులకు ఉండవు మూడు కళ్ళు. మనుషులకు రెండు కళ్ళే ఉంటాయి. నువ్వు దయ్యనివా? రాక్షసివా? దేవుడివి అయితే కాదు నువ్వు ఈ రెండిట్లోనే ఏదో అయిఉంటావు. భాష మార్చుకో. 2004 వరకు టీడీపి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది. తెలంగాణ బిడ్డల్ని ఊచకోత కోశాడు చంద్రబాబు అని చెప్పావు. సిగ్గుందా? మనిషివేనా నువ్వు? 2004 లో ఎవరితో కలిసి గెలిచావు? 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 లో చంద్రబాబు ఇంటికి వచ్చి దేహి అని అడిగి మాతో పొత్తు పెట్టుకున్నావు. నువ్వన్నట్టే మేము తెలంగాణ బిడ్డల్ని ఎన్కౌంటర్ చేస్తే 2009 లో మాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు అని కెసిఆర్ పై మండి పడ్డారు నక్కా ఆనందబాబు. టిడిపి తో పొత్తు కోసం చంద్రబాబుని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డావు అని గుర్తు చేశారు.

పొత్తు కలుపుకున్నాక ఎన్నిసార్లు డబ్బు కోసం వెంపర్లాడవు అంటూ నిలదీశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము డబ్బు ఇచ్చాము అని చెబుతున్నావా అంటూ ఆగ్రహించారు. 2009 లో పొత్తు కలుపుకున్నందుకు నీకు ఎంత ఇచ్చామో బయటపెట్టమని అన్నారు. ఇటువంటి భాషా ప్రయోగం నీచ సంస్కృతికి నిదర్శనం. అలా మాట్లాడే నీలాంటి నీచుల్ని రాజకీయాల్లో చూడటం చాలా అరుదు. నువ్వు భాషతో గెలవాలి అనుకుంటున్నావు. తెలంగాణాలో ఏం కుడబీకావో చెప్పు నువ్వు. ఈ నాలుగున్నరేళ్లలో తోపువు నువ్వు తెలంగాణాలో ఏం పని చేశావో చెప్పాలంటూ డిమాండ్ చేశారు నక్కా ఆనంద్ బాబు.

తెలంగాణ సాధించుకున్నారు సంతోషం. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నువ్వు సాధించింది ఏమి లేదు. నువ్వు చేసినవన్నీ దొంగ దీక్షలు. అందరికి తెలుసు. ఏం దీక్ష తీసావో పాత ఫుటేజిలు తీస్తే అర్ధం అవుతుంది నీ బ్రతుకు. ఆరోజు పత్రికల్లో వచ్చింది, ఛానెళ్లలో వచ్చింది నువ్వు ఏ విధంగా దీక్షలు చేశావో. అవన్నీ బయటకు తీస్తే నీ బాగోతం ఏంటో ప్రజలకు తెలుస్తోంది. నీతో పార్టీలు ఎలా పొత్తులు పెట్టుకుంటున్నాయో తెలియట్లేదు. వాళ్ళకైనా సిగ్గుండాలి లేదా నీకైనా సిగ్గుండాలి నీతో కలిసి రాజకీయాలు చేయటానికి అని ఘాటుగా విమర్శించారు. నువ్వు, జగన్, పవన్ గవర్నర్ తో కలిసి లాలూచి రాజకీయాలు చేస్తున్నారు. మా బతుకు మేము బతుకుతున్నాం. ఎందుకు విషం చిమ్ముతున్నావు అంటూ ప్రశ్నించారు. నువ్వు సాధించేది ఏమి లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. ఈ దిగజారుడుతనంతో టీఆరెస్ పార్టీ, కుటుంబ పరిపాలన అంతమైపోతుంది అని వెల్లడించారు.

 

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్