వైయస్ జగన్ తో అలీ…బూతులు తిడుతూ పోస్ట్ లు

ప్రముఖ హాస్యనటుడు అలీ, వైయస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తూంటే వీళ్లిద్దరూ ప్లైట్ లో కలిసినప్పుడు మాట్లాడుకున్నట్లు గా కనపడుతోంది. ఇక ఈ విషయమై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

మీడియాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో అలీ మాట్లాడటం ఇంట్రస్టింగ్ విషయంగా మారింది. దాంతో ఈ విషయానికి తమ ఊహాశక్తిని జోడించి అనేక వార్తలు వండి వడ్డించేస్తున్నారు. ఈ మీటింగ్ సుదీర్ఘంగానే సాగిందని, జగన్ తో అలీ దాదాపు గంట సేపు చర్చించినట్టుగా వార్తలు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అందుకు కారణం ఒకటే.. అలీ కేవలం నటుడిగానే కాకుండా.. మొదట నుంచి కొంత పొలిటికల్ ఇంట్రస్ట్ ఉన్న వాడిగా కూడా పేరు పొందటమే. అలీ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి పోటీ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు.

ఇదిలా ఉంటే.. అలీకి స్నేహితుడు, సన్నిహితుడు అయిన పవన్ కల్యాణ్ జన సేన పేరుతో రాజకీయ పార్టీని పెట్టాడు.దాంతో పవన్ ప్రతీ సినిమాల్లోనూ కనిపించే అలీ.. ఆయన పార్టీలోనూ చేరుతాడని అందరూ అంచనా వేసారు. అయితే ఊహించని విధంగా జగన్ తో ఇలా మాట్లాడుతూ…అలీ కనిపించటం అనేక టాపిక్స్ కు కేంద్రబిందువు అయ్యింది. ఇక సోషల్ మీడియాలో పవన్ కు సన్నిహితంగా ఉంటూ…ఇలా చేస్తావా అంటూ బూతులుతో కూడిన పోస్ట్ లు సైతం కనపడుతున్నాయి.

అయితే అసలు ఎందుకు జగన్ ని కలిసారో..ఏం మాట్లాడుకున్నారో, ఏం నిర్ణయాలు తీసుకున్నారో, లేక క్యాజవల్ మీటింగా వంటివి చూసుకోకుండా ,ప్రకటన ఏమీ రాకుండా అలీ ని విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టడం మాత్రం పద్దతి కాదనేది నిజం. అది కూడా విమర్శ లెవిల్లో కాకుండా బూతులతో దిగజారటం తమను తాము దిగజార్చుకోవటమే అని మేధావులు విశ్లేషిస్తున్నారు.