జీహెచ్ ఎంసీ కార్పొరేటర్ నకిలీ నోట్ల వివాదంలో చిక్కుకున్నారు. రామాంతాపూర్ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు బయలుదేరేముందు కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో గాల్లోకి పైసలు వెదజల్లారు. దీంతో డప్పులు కొట్టేవారు ఆ డబ్బులను ఏరుకున్నారు.
దానిని చూసిన వారంతా రాజకీయ నాయకులై ఉండి గాల్లోకి పైసలు విసరడం పై విమర్శిస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి అవి కాగితపు నోట్లని తేలడంతో అంతా వాటిని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ర్యాలీలో గాల్లోకి డబ్బులు వెదజల్లిన వీడియో కింద ఉంది చూడండి.
