తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్టయ్యింది.

కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు దూరమైందని అంతా ఒంటెద్దు పోకడలతో పోతున్నారని సురేందర్ అన్నారు. తాను 2001 లో కేసీఆర్ తో కలిసి నడిచానని మళ్లీ నియోజకవర్గ అభివృద్ది కోసం కలిసి నడవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోతే కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు అయ్యే అవకాశం ఉంది.
