ప్రగతి నివేదన సభకు ప్రజలిచ్చిన షాక్ తో కేసీఆర్ దిమ్మతిరిగిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 25 లక్షల మందితో సభను ఘనంగా నిర్వహిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రికి అందులో 5 శాతం జనాలు కూడా సభకు రాకపోయే సరికి భయం పట్టుకుందన్నారు. ముందస్తు అంటూ మురిపించిన కేసీఆర్ కు భయం పుట్టడంతో వెనకడుగు వేశారని విమర్శించారు.
కేసీఆర్ ప్రసంగం సప్పాగా సాగిందని ఎద్దేవా చేశారు. ఎన్నో ఆశలతో ప్రజలను ఊరించి చివరకు ఊసురుమన్నాడన్నారు. సభ ఇలా ఎందుకు డీలా పడిందో అనే మధనతో కేసీఆర్ మళ్లీ యాగాల బాట పట్టనున్నారని ఏ యాగాలు చేసినా కేసీఆర్ కుయుక్తులు పండవన్నారు.