తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ప్రజలను సమకూర్చే పనిలో పార్టీ శ్రేణులు తీవ్రంగ శ్రమిస్తున్నారు. అయితే మంత్రి సభకు అధికంగా హాజరయిన జనాన్ని, యువతను, కార్యకర్తలను కింద ఉన్న ఫోటోలో మనం చూడవచ్చు.

చూశారు కదా.. అవును ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి సభకు ప్రజలు లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టి సభలు పెడుతున్నారు. అసలు ఆ పిల్లలకు పార్టీ అంటే కూడా ఏమిటో తెలియదు. అసలు వారు ఏం చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు, ఎవరి కోసం చెబుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఆ చిన్న పిల్లలున్నారు. మంత్రి కూడా ఆ చిన్నారుల ముందే ఉపన్యాసాలిచ్చి వెళ్లి పోతున్నారు.
మంత్రి గారి సభల తీరు పై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. చిన్నపిల్లలను సభలకు తీసుకెళ్లడం చట్ట విరుద్దమని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే ప్రజలు వచ్చే వారని కానీ అప్పుడు ప్రజలను పట్టించుకోకపోవడంతో టిఆర్ ఎస్ కు ఈ పరిస్థితి వచ్చిందని వారు విమర్శించారు.
