టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఓటర్ల పై తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు. మొన్న నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్ధి భూపాల్ రెడ్డి ఓటర్లను తిట్టిన వివాదం మరిచిపోకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట అభ్యర్ధి తిట్లదండకమెత్తారు.
ఎన్నికల ప్రచారానికి అశ్వారావు పేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి టిఆర్ ఎస్ అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లు వెళ్లారు. గ్రామంలో ఓట్లు అడుగుతుండగా గ్రామస్థులు వెంకటేశ్వర్లుని నిలదీశారు. వైసీపీ నుంచి మేము గెలిపిస్తే 5 కోట్ల రూపాయలకు నీవు అమ్ముడు పోయావని ప్రశ్నించారు. మా ఊరికి ఏం చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులు తాటి వెంకటేశ్వర్లును నిలదీసిన వీడియో కింద ఉంది చూడండి.
