Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారసింహ దేవాలయాల యాత్ర చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల క్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ యాత్రను ఆయన చేయబోతున్నారట. స్వయంగా ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
అయితే, ఏకధాటిగా ఈ యాత్రని పవన్ కళ్యాణ్ చేస్తారా.? అంటే, ఆ అవకాశమే లేదు. ఓ వైపు సినిమాలు, ఇంకోవైపు రాజకీయం.. మధ్యలో ఈ ఆధ్మాత్మిక యాత్రల సంగతేంటి.? ఈ విషయమై సినీ, రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సరే, రాజకీయ నాయకులన్నాక రాజకీయమే చేయాలనుకోండి.. అది దేవాలయాలతో అయినాసరే.! భక్తి ముసుగులో రాజకీయం చేయనివారెవరు.? కానీ, పవన్ కళ్యాణ్ అలా రాజకీయాన్నీ, ఆధ్మాత్మికతనూ ఒకే గాటన కట్టేస్తారా.? అన్నదానిపై ఎవరి వాదన వారిది.
తెలంగాణలో ఎన్ని నారసింహ దేవాలయాలకు పవన్ వెళతారు.? ఏపీలో ఎన్ని దేవాలయాల్ని ఆయన సందర్శిస్తారు.? అన్నదానిపై రూట్ మ్యాప్ ఇప్పటికే జనసేన సిద్ధం చేసిందని అంటున్నారు. వీటిల్లో ఎక్కువ భాగం తెలంగాణలో వుండొచ్చునట.
ఆంధ్రప్రదేశ్లో నారసింహ దేవాలయాలు చాలా ఎక్కువే. రాయలసీమ ప్రాంతంలోనూ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లో నారసింహ దేవాలయాల సంగతి సరే సరి. అన్నట్టు, ప్రముఖ నారసింహ దేవాలయం అంతర్వేదిలో కొన్నాళ్ళ క్రితం రథం దగ్ధమైన విషయం విదితమే.
మరి, నారసింహ దేవాలయాల పర్యటనతో పవన్ కళ్యాణ్ చేయబోయే రాజకీయమెలా వుండబోతోంది.? దీనివల్ల జనసేన పార్టీకి కలిగే రాజకీయ లబ్ది ఎంత.? వేచి చూడాల్సిందే.
