Rajamouli Thanks To Ys Jagan : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు భారీ సినిమాల్లో దర్శక దిగ్గజుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పీరియాడిక్ వండర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. ఇద్దరు మాస్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో తీసిన ఈ సినిమా వచ్చింది అంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే.
కానీ దానికి మాత్రం ఏపీలో పరిస్థితులు గత కొన్నాళ్ల నుంచి అసలు ఊహించని రీతిలో మారిపోయాయి. ఆకస్మికంగా మార్పు చేసిన ధరలతో భారీ సినిమాల వసూళ్లకు ఇది పెద్ద ఆటంకంగా మారింది. కానీ ఫైనల్ గా చిరు ముందడుగు వేసి రాజమౌళి సహా ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకెళ్లి జగన్ తో మాట్లాడి కొత్త ధరలపై కొత్త జీవో వచ్చేలా చేశారు.
సరే ఇక్కడ నుంచి టాలీవుడ్ పెద్దలు ఆరోజు హాజరైన వారు ఒక్కొక్కరిగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మరియు మంత్రి పేర్ని నానీలకు థాంక్స్ చెప్తూ పోస్ట్ లు వేస్తున్నారు. అలా ఇప్పుడు రాజమౌళి కూడా వేశారు కానీ అభిమానులు మాత్రం ఇదంతా కాస్త ఇన్ కంప్లీట్ గా ఉన్నట్టుంది అంటున్నారు.
రాజమౌళి నాని మరియు జగన్ లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొత్త జివో తెలుగు సినిమాకి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నానని కాస్త సింపుల్ గానే తాను పోస్ట్ చేశారు. దీనితో నెటిజన్స్ ఈ పోస్ట్ పై పెదవి విరుస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే రాజమౌళి తెరకెక్కించిన తన భారీ సినిమా ఈ మార్చ్ 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
Thanks to the CM of AP @ysjagan garu and @perni_nani garu for aiding the Telugu Film fraternity through the revised ticket pricing in the new G.O. Hope this helps towards the revival of cinemas.
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022
