Roja : సగర్వంగా మంత్రివర్గంలోకి: పంతం నెగ్గించుకున్న రోజా.!

Roja : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి మంత్రి వర్గంలోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా అవకాశం దక్కించుకుని వుండాలి. కానీ, చాలా శక్తులు ఆమెకు అడ్డుపడ్డాయి. ఆ శక్తులన్నీ సొంత పార్టీకి చెందినవే. సొంత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ వస్తున్నారు.

నిజానికి, రాజకీయాల్లో మొదటి నుంచీ ఆమె పోరాటమే చేయాల్సి వస్తోంది.. ఆమె ఏ పార్టీలో వున్నాగానీ. ఎలాగైతేనేం, రోజా మంత్రి అవబోతున్నారు. ఎమ్మెల్యే అవడం ఎలాగైతే ఆమె ఓ గొప్ప టార్గెట్ అనుకున్నారో.. అంతకు మించిన టార్గెట్.. మంత్రి అవడం.

అసాధ్యమనుకున్నవాటిని రోజా సుసాధ్యం చేసుకోగలిగారు. నిజానికి, చివరి నిమిషం వరకూ రోజాకి మంత్రి పదవి విషయమై సస్పెన్స్ నడిచింది. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులకు అవకాశమిస్తూ.. అదనంగా రోజాకి అవకాశమివ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటివారిని పక్కన పెట్టి రోజాకి మంత్రి వర్గంలో వైఎస్ జగన్ చోటు కల్పించారంటే, తెరవెనుకాల రోజా ఎంత కష్టపడి వుండాలి.. ఎన్ని శక్తుల్ని దాటి ముందుకు సాగి వుండాలి.?

ఈ దెబ్బతో రోజా మీద సొంత పార్టీలో వున్న వ్యతిరేకత అంతా గల్లంతైపోవాలంతే.! మంత్రి పదవి చేతిలో వుంటే రోజా రఫ్ ఆడించేయడం ఖాయం.! ఆ విషయం వైసీపీలో రోజా వ్యతిరేక వర్గానికీ బాగా తెలుసు.

ఇకపై నగిరి నియోజకవర్గంలో పెద్దగా అలజడి వుండకపోవచ్చు వైసీపీకి సంబందించి.